Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

నిర్మల్‌ జిల్లాలో భారీ వర్షాలపై మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి సమీక్ష

నిర్మల్‌ జిల్లాలో భారీ వర్షాల కారణంగా కలిగిన నష్టాలపై అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి జిల్లా అధికారులతో కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. వరదల వల్ల ముంపుకు గురైన ప్రాంతాల పరిస్థితిని, పంట నష్టం, పునరావాస ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
వ్యవసాయ, ఆర్‌అండ్‌ బీ విద్యుత్‌ శాఖ, పంచాయితీ రాజ్‌, రెవెన్యూ శాఖల పరిధిలో జరిగిన నష్టం వివరాలు తెలుసుకున్నారు. ఆయా శాఖల పరిధిలో జరిగిన నష్టం వివరాలు, అంచనాలతో ప్రాథమిక నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలతో తలెత్తిన పరిస్థితి, ప్రస్తుతం తీసుకున్న పునరావాస చర్యలు, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు మంత్రి దిశానిర్ధేశం చేశారు. మరో రెండు రోజులు భారీ వర్షాలు కొనసాగే సూచనలు ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img