Wednesday, April 17, 2024
Wednesday, April 17, 2024

నైట్‌ కర్ఫ్యూ అవసరం లేదు: శ్రీనివాసరావు

తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ విధించేంత తీవ్రంగా కరోనా వ్యాప్తి లేదని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు (డీహెచ్‌) డాక్టర్‌ శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్రంలో పాజిటివిటి రేటు 3.16 శాతంగా ఉందని, పాజిటివిటి 10 శాతం దాటితే రాత్రి కర్ఫ్యూ వంటివి అవసరం అవుతాయని కానీ గత వారం రోజుల్లో ఒక్క జిల్లాలో కూడా పాజిటివిటీ రేటు 10 శాతం దాటలేదన్నారు. . మెదక్‌లో అత్యధికంగా 6.45 శాతం, కొత్తగూడెంలో 1.14 శాతం పాజిటివిటీ రేటు నమోదైందని అన్నారు. జీహెచ్‌ ఎంసీలో 4.26, మేడ్చల్‌ లో 4.22 శాతం పాజిటివిటీ రేటు ఉందని తెలిపారు ముందు జాగ్రత్తగా జనం గుమిగూడకుండా ఈనెల 31 వరకు ఆంక్షలు పొడిగించినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి జ్వరం సర్వే జరుగుతోందని, మూడు రోజుల్లోనే లక్షణాలున్న 1.78 లక్షల మందికి కిట్లు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img