Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

నేటితో ముగియనున్న ఉపఎన్నిక నామినేషన్ల ఉపసంహరణ గడువు

నేటితో హుజూరాబాద్‌ ఉపఎన్నిక నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియనుంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఉపసంహరణ గడువు ముగుస్తుంది. దీంతో ఎంత మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకుంటారు, ఎందరు పోటీలో ఉండనున్నారనే విషయంతో సాయంత్రం తెలనుంది. ప్రస్తుతం 42 మంది బరిలో ఉన్నారు.మాజీమంత్రి ఈటల రాజేందర్‌ రాజీనామాతో హుజూరాబాద్‌ నియోజకవర్గానికి ఉపఎన్నిక తప్పనిసరి అయింది. దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం అక్టోబర్‌ 1న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నెల 30న ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. నవంబర్‌ 2న ఫలితాలు వెలువడనున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img