రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్
హుజూరాబాద్ ఉప ఎన్నిక ఏర్పాట్లపై మంగళవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ మీడియాతో మాట్లాడారు. హుజూరాబాద్ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో కరీంనగర్, హనుమకొండ జిల్లాల్లో నేటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, నామినేషన్లు దాఖలు చేసే సమయంలో ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని, కేవలం మూడు వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టంచేశారు. పోలింగ్కు 72 గంటల ముందే ప్రచారం ముగించాలని చెప్పారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో 305 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 47 పోలింగ్ కేంద్రాల్లో వెయ్యి కంటే ఎక్కువ ఓటర్లు ఉన్నారు. వయోవృద్ధులకు, దివ్యాంగులకు, కొవిడ్ రోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తామన్నారు.