Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

నేడు తెలంగాణలో ఎక్కడ చూసినా పచ్చని పొలాలు, ధాన్యం రాసులు.. : కేటీఆర్‌

దేశ చరిత్రలో ఈరోజు సువర్ణాక్షరాలతో లిఖించే సందర్భం అని, రాష్ట్రంలో 65 లక్షల రైతు కుటుంబాలకు 50 వేల కోట్ల రైతుబంధు ఇచ్చిన రోజు అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ, కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ సంక్రాంతి వరకు రైతుబంధు సంబరాలు ఉంటాయన్నారు. . ఉమ్మడి ఏపీ రైతు ఆత్మహత్యల్లో ఫస్ట్‌, దిగుబడిలో లాస్ట్‌ ఉండేదన్నారు. ఉమ్మడి పాలకులు అంతా అన్నం పెట్టిన రైతులకు సున్నం పెట్టినవారే అని విమర్శించారు. ‘‘నేను చెప్పేది తప్పైతే మమ్మల్ని కూడా చీల్చి చెండాడండి.. నేడు తెలంగాణలో ఎక్కడ చూసినా పచ్చని పొలాలు, ధాన్యం రాసులు.. ఆగమైన రైతు బాగు పడుతున్నాడు’’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img