భద్రాద్రిలో శ్రీరాముని పట్టాభిషేక మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ హాజరయ్యారు. తొలుత ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్కు ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి తమిళిసై పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.