న్యూ ఇయర్ వేడుకలకు అదనంగా బస్ సర్వీసులు నడపాలని తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎండీ సజ్జనార్ నిర్ణయం తీసుకున్నారు. న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొనే వారి కోసం హైదరాబాద్లో ప్రత్యేకంగా బస్సులు నడపనున్నట్లు తెలిపారు. నగర శివారులో ఉన్న ఈవెంట్స్ జరిగే ప్రాంతాలకు బస్సు సర్వీసులు నడపాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది.దీని కోసం ఒక్కరికి 100 రూపాయల ఛార్జ్ వసూలు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ సూచించిన 15 ప్రాంతాలకు ఈ సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. ఈవెంట్స్ వెళ్లే వారికోసం రాత్రి 7.30 రాత్రి 9.30 వరకు, తిరుగు ప్రయాణం అర్ధరాత్రి 12.30 నుండి తెల్లవారుజామున 3 గంటల వరకు బస్సు సౌకర్యం కల్పించనున్నట్లు ప్రకటించింది. దీంతోపాటు 18 సీట్ల ఏసి బస్సు వెళ్లి రావటానికి 4000 రూపాయలుగా తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించింది.