మంత్రి శ్రీనివాస్ గౌడ్
తెలంగాణ రైతాంగం వైపు దేశం చూస్తోందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రం వైఖరికి నిరసనగా జిల్లా కేంద్రంలోని జెడ్పీ గ్రౌండ్ నుంచి తెలంగాణ చౌరస్తా వరకు ర్యాలీ, శవయాత్ర నిర్వహించారు. ఈ ర్యాలీలో మంత్రి డప్పు కొడుతూ శవయాత్రలో పాల్గొన్నారు. తెలంగాణ చౌరస్తా వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..దేశంలోని వ్యవసాయ రంగాన్ని కేంద్ర ప్రభుత్వం అంబానీ, ఆదానీలకు అప్పజెప్పేందుకు కుట్ర చేస్తోందని అన్నారు. ు. 2014 కంటే ముందు తరువాత తెలంగాణా రైతాంగం ఎలా వుందో ఒక్కసారి ఆలోచించుకోవాలన్నారు. దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందని అన్నారు. . కేంద్రం తెలంగాణ రైతులను మోసం చేస్తుందని అన్నారు. . ధాన్యం కొననంటుంది.విద్యుత్ రంగ సంస్థల్ని కూడా ప్రైవేట్కి అప్పజెప్పాలని చూస్తుందని మండిపడ్డారు. అన్ని ప్రైవేట్ పరం చేస్తూ దేశాన్ని తిరోగమనంలో నడిపిస్తున్నారని అన్నారు. . పంజాబ్లో కొంటరు. తెలంగాణలో కొనరు..పంజాబ్కో న్యాయం..తెలంగాణకు ఓ న్యాయమా అని ప్రశ్నించారు.