ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి
పంజాబ్ వడ్లు ఎలా తియ్యగైనయని, తెలంగాణ వడ్లు చేదెందుకైనవని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. హనుమకొండ జిల్లాలోని ధర్మసాగర్లో జరిగిన నిరసన కార్యక్రమంలో రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పంజాబ్లో 2 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారని, మరి తెలంగాణ రైతులు పండిరచిన ధాన్యానికి ఉప్పుడు బియ్యమని, దొడ్డు బియ్యం అని, రా రైస్ అని వంకలు పెడుతున్నారని అన్నారు. ధాన్యం కొనాల్సిన బాధ్యత కేంద్రానిదేనని అన్నారు. ఉప్పుడు బియ్యం మొదలు పెట్టిందే ఎఫ్సీఐ అని తెలిపారు. బీజేపీని గ్రామ గ్రామాన తరిమికొట్టాలన్నారు.ఎఫ్సీఐ వెంటనే మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వానాకాలం, యాసంగి ధాన్యాన్ని తీసుకుంటారా లేదా స్పష్టంగా చెప్పాలన్నారు. రాష్ట్రం నుంచి ఎన్నికైన బీజేపీ ఎంపీలు ఢల్లీిలో నోరు మెదపట్లేదని విమర్శించారు. ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతుంటే బీజేపీ నేతలు రాజకీయం చేస్తున్నారని అన్నారు.