ఎమ్మెల్సీ కవిత ట్వీట్
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల లబ్దిదారుల సంఖ్య పది లక్షలకు చేరింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల లబ్దిదారులు పది లక్షలకు చేరుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. సామాజిక మార్పునకు సీఎం కేసీఆర్ దిక్సూచిగా నిలిచారు అని పేర్కొన్నారు. దేశంలోనే తొలిసారిగా 2014లో ప్రారంభమైన ఈ రెండు పథకాల ద్వారా నిరుపేదల ఆడబిడ్డల వివాహాలకు సీఎం కేసీఆర్ ఆర్థిక సాయం అందిస్తున్నారు అని కవిత గుర్తు చేశారు.