పాఠశాలల పునః ప్రారంభపై కలెక్టర్లతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు తెరిచి, భౌతిక తరగతులు నిర్వహించాలని తెలంగాణ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వారం రోజుల్లో పాఠశాలలో అన్ని ఏర్పాట్లు చేపట్టేలా చర్యలపై మంత్రి దిశా నిర్దేశం చేశారు. ఈ నెల 30లోపు పాఠశాలలలో పారిశుద్ధ్య పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల వసూళ్లపై నిఘా పెట్టాలని చర్చలు జరిపారు. ఈ సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్, విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పాఠశాలల పునః ప్రారంభంపై విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. కొవిడ్ నేపథ్యంలో నిబంధనలకు లోబడి తరగతులు నిర్వహించాలని సూచించింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు.