మరో ముగ్గురికి తీవ్రగాయాలు
రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. నల్లగొండ, సిద్దిపేట, జగిత్యాల జిల్లాల్లో పిడుగుపాటుకు ఇద్దరు మరణించగా..ంండు కాడెద్దులు, 43 మేకలు మృతిచెందాయి. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. . నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం మోదినిగూడెంలో పిడుగుపాటుకు లింస్వామి అనే వ్యక్తి మృతిచెందాడు. సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక మండలం నరేండ్లగడ్లలో పిడుగుపడి రైతు మరణించాడు. ధాన్యంపై టార్పాలిన్ కప్పుతుండగా పిడుగుపడి పోచయ్య మృతిచెందగా, మరో రైతు తీవ్రంగా గాయపడ్డాడు. మద్దూరు మండలంలో ఓ రైతుకు చెందిన రెండు కాడెద్దులు పిడుగుపాటుకు మరణించాయి. వీటివిలువ సుమారు రూ.లక్షా 50 వేలు ఉంటుందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక జగిత్యాల మండలం బల్వంతాపూర్లో పిడుగుపడి ఇద్దరు గాయపడగా, 43 మేకలు మృతిచెందాయి.