ప్రశాంత్ కిషోర్ రాజకీయ ఆరంగేట్రంపై టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం స్పందించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పీకే ప్రకటన వెనుక సీఎం కేసీఆర్ ఉన్నారని అన్నారు. కేసీఆర్ జాతీయ పార్టీ.. ప్రశాంత్ కిషోర్ పార్టీ ఒక్కటేననే అనుమానం కలుగుతుందని చెప్పారు.కసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం కోసం పీకేను వాడుకుంటున్నారన్నారు.ఉస్మానియా యూనివర్సిటీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి అనుమతి ఇవ్వాలనేది ప్రొఫెసర్గా తన అభిప్రాయమన్నారు.రాహుల్ గాంధీ రావాలని విద్యార్థులు కోరుకుంటున్నారని చెప్పారు. వివిధ పార్టీల నాయకుల రాకతో యూనివర్సిటీ విద్యార్థులకే మేలు జరుగుతుందని తెలిపారు.యూనివర్సిటీలో సభలకు అనుమతి అనేది పూర్తిగా వర్సిటీ అధికారులదే బాధ్యతని అన్నారు.రానున్న ఎన్నికల కోసం 25నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు.బావ సారూప్యత కలిగిన పార్టీలతో కలిసి పోటీచేస్తామని చెప్పారు.