సీఎం కేసీఆర్తో ఎన్నికల వ్యూహకర్త, ఐప్యాక్ ప్రశాంత్ కిశోర్ (పీకే) భేటీపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్తో తెగదెంపులు చేసుకునేందుకే పీకే కేసీఆర్ను కలిశారని అన్నారు.ఇకపై టీఆర్ఎస్ కు, ప్రశాంత్ కిశోర్ కు చెందిన ఐప్యాక్ సంస్థకు సంబంధాలు తెగిపోయినట్టేనని పేర్కొన్నారు. ప్రశాంత్ కిశోర్ విషయంలో మేం ముందు నుంచి చెప్పిందే ఇప్పుడు జరిగిందని రేవంత్ స్పష్టం చేశారు. ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేరగానే తనతో కలిసి సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహిస్తారని, టీఆర్ఎస్ ను ఓడిరచాలని ఆయనే స్వయంగా పిలుపునిస్తారని తెలిపారు. తనతో కలిసి ప్రశాంత్ కిశోర్ ప్రెస్ మీట్ పెట్టే రోజు దగ్గర్లోనే ఉందని స్పష్టం చేశారు.