పెట్టుబడిదారుల ప్రయోజనాలకు కొమ్ముగాస్తూ వ్యవసాయాన్ని క్రమంగా కొర్పొరేట్ శక్తులపరం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ కుట్రలు చేస్తున్నదని మంత్రి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. మాదాపూర్ హెచ్ఐసీసీలో జరుగుతున్న టీఆర్ఎస్ ప్లీనరీలో యాసంగిలో వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నందుకు అభినందించే తీర్మానాన్ని మంత్రి ప్రవేశపెట్టారు. దీనికి మంత్రి గంగుల కమలాకర్ మద్దతు తెలిపారు.