Friday, April 19, 2024
Friday, April 19, 2024

పెట్టుబడిదారులే రాష్ట్రానికి అతిపెద్ద బ్రాండ్‌ అంబాసిడర్లు : మంత్రి కేటీఆర్‌

తెలంగాణలో పరిశ్రమల కోసం అనువైన పాలసీ అమల్లో ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. శంషాబాద్‌లో సాఫ్రాన్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంజిన్‌ ఎంఆర్‌ఐ ఫెసిలిటీని మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌, పరిశ్రమల కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. హైదరాబాద్‌లో మెగా ఏరో ఇంజిన్‌ ఎంఆర్‌ఓ ఏర్పాటుకు శాఫ్రాన్‌ నిర్ణయించిందని తెలిపారు. హైదరాబాద్‌లో శాఫ్రాన్‌ ఏర్పాటు చేసే ఎంఆర్‌ఓ ప్రపంచంలోనే పెద్దదని చెప్పారు. ప్రపంచస్థాయి సంస్థ భారత్‌లో ఏర్పాటు చేసే మొదటి ఇంజిన్‌ ఎంఆర్‌ఓ అని పేర్కొన్నారు. ఎంఆర్‌ఓ, ఇంజిన్‌ టెస్ట్‌ సెల్‌ పెట్టుబడి దాదాపు రూ. 1200 కోట్లు అని తెలిపారు. 800 నుంచి వెయ్యి మంది దాకా ఉపాధి లభిస్తుందన్నారు. శాఫ్రాన్‌ నిర్ణయం హైదరాబాద్‌లో పెట్టుబడి పెట్టేందుకు ఇతర సంస్థలకు ప్రేరణగా నిలుస్తుందన్నారు. పెట్టుబడిదారులే రాష్ట్రానికి అతిపెద్ద బ్రాండ్‌ అంబాసిడర్లని సీఎం కేసీఆర్‌ అంటుంటారని గుర్తు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img