Friday, April 19, 2024
Friday, April 19, 2024

పైసా ఖర్చు లేకుండా..డబుల్‌ ఇళ్లు : మంత్రి హరీష్‌ రావు

కోహిర్‌ మండలం దిగ్వాల్‌ లో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ రావు మాట్లాడుతూ.. హైదరాబాలోని గేటెడ్‌ కమ్యూనిటీని తలపించే విధంగా ఇక్కడ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు ఉన్నాయన్నారు. కాంగ్రెస్‌ హయాంలో ఇలాంటి ఇండ్లు చూసారా అంటూ ప్రశ్నించారు. అప్పట్లో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇల్లు రావాలంటే లంచాలు ఇచ్చేవారు, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఒక్క పైసా ఖర్చు లేకుండా అన్ని వసతులతో రెండు పడక గదుల ఇండ్లను నిర్మించి ఉచితంగా మీ చేతుల్లో పెడుతున్నాం అన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పాటుపడుతున్నదని స్పష్టం చేసారు. ఖాళీ జాగా ఉన్న వారికి ఇండ్లు నిర్మంచుకోవడానికి డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img