Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

పోలీసు అభ్యర్థులకు శుభవార్త.. అర్హత పరీక్షలో వాళ్లకు కటాఫ్‌ మార్కులు తగ్గింపు

ఇటీవల జరిగిన ఎస్సై, కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్షల విషయంలో అసెంబ్లీ వేదికగా సంచలన ప్రకటన చేశారు. పోలీసుల అర్హత పరీక్షలో కటాఫ్‌ మార్కులు తగ్గిస్తామని వెల్లడిరచారు. అయితే.. ఈ వెసులుబాటు కేవలం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు. గత కొన్ని రోజులుగా వెల్లువెత్తున్న నిరసనల నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ఈ ప్రకటన చేశారు. పోలీస్‌ నియామక పరీక్షల్లో ఓసీ అభ్యర్థులకు తగ్గించినట్లే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కూడా 20 మార్కులు తగ్గించాలని రాష్ట్రంలో ఆందోళనలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. గతంలో జరిగిన పోలీసు నియామక పరీక్షల్లో ఎస్సీ, ఎస్టీలకు కటాఫ్‌ మార్కులు 30 శాతంగా.. బీసీలకు 35 శాతంగా.. ఓసీలకు 40 శాతంగా ఉండేవి. కానీ.. ఈసారి సామాజికవర్గాలతో సంబంధం లేకుండా అందరికీ 30 శాతం మార్కులనే అర్హతగా పరిగణించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే పరీక్షలో 200 ప్రశ్నలకు గానూ… 60 మార్కులు వస్తే సరిపోతుంది. మళ్లీ ఇందులో నెగెటివ్‌ మార్కులు కూడా ఉంటాయి. దీని ప్రకారం.. ఓసీలకు 10 శాతం, బీసీలకు 5 శాతం సడలింపు ఇచ్చినట్టయింది. దీంతో.. తమకు ఎలాంటి సడలింపు ఇవ్వలేదని ఎస్సీ, ఎస్టీలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తమకు అన్యాయం చేస్తోందని నిరసనలు వ్యక్తం చేశారు.
ఈ నిర్ణయానికి ముందు.. బంజారాహిల్స్‌లోని మినిస్టర్‌ క్వార్టర్స్‌ ముట్టడిరచేందుకు ఎమ్మార్పీఎస్‌ నేతలు యత్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ,మైనారిటీ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని.. ఓసీలకు మాత్రమే మార్కులు తగ్గించడం, మిగిలిన వారికి మార్కులు తగ్గించకపోవడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలకు సమన్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ వివాదానికి కారణమైన పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ ఛైర్మన్‌ శ్రీనివాసులును వెంటనే సస్పెండ్‌ చేయాలంటూ ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు. తెలంగాణలో 554 ఎస్సై పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇవ్వగా ఏకంగా 2,47,217 దరఖాస్తులు వచ్చాయి. ప్రిలిమినరీ పరీక్షకు 91.32 శాతం అంటే.. 2,25,759 మంది పరీక్ష రాశారు. మరోవైపు 16,321 కానిస్టేబుల్‌ పోస్టుల కోసం ఏకంగా 6,61,198 అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. అందులో 91.34 శాతం అంటే 6,03, 955 మంది ప్రిలిమినరీ పరీక్ష రాశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img