Friday, April 19, 2024
Friday, April 19, 2024

పోలీసు విధులకు ఆటంకం కలిగిస్తే కఠినచర్యలు తీసుకోవాలి : మంత్రి కేటీఆర్‌

విధుల్లో ఉన్న పోలీసులకు ఆటంకం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ట్విట్టర్‌లో డీజీపీ మహేందర్‌ రెడ్డిని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ కోరారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించిన ఓ కార్పొరేటర్‌ వ్యవహార శైలిని ఓ నెటిజన్‌ మంత్రి కేటీఆర్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి దృష్టికి ట్విట్టర్‌ ద్వారా తీసుకెళ్లారు. పోలీసులకు గౌరవం ఇవ్వకుండా దురుసుగా ప్రవర్తిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆ నెటిజన్‌ విజ్ఞప్తి చేశారు. ఇలాంటి నిరక్షరాస్యుల ప్రవర్తనను సహించేది లేదని ఆ వ్యక్తి పేర్కొన్నారు. ఈ ట్వీట్‌పై మంత్రి కేటీఆర్‌ సీరియస్‌గా స్పందిస్తూ.. ఆ వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి ట్వీట్‌ చేశారు.పార్టీలకు అతీతంగా ఎవర్నీ సహించేది లేదని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img