Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ప్రకృతి పరిరక్షణ ప్రజా ఉద్యమంగా రూపుదాల్చాలి

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

విశాలాంధ్ర ` హైదరాబాద్‌ : ప్రకృతి పరిరక్షణ ప్రజా ఉద్యమంగా రూపుదాల్చాల్సిన అవసరం ఉందని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయ పడ్డారు. ప్రకృతి పరిరక్షణ, అభివృద్ధిని సమన్వయం చేసుకుంటూ ఆరోగ్యకరమైన భవిష్యత్తు నిర్మాణంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ ముచ్చింతల్‌లోని స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ను శుక్రవారం ఆయన సందర్శించారు. అక్కడ కొనసాగుతున్న వివిధ శిక్షణ కార్యక్రమాలను పరిశీలించి, విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. నూతన నైపు ణ్యాలతో యువత తమను తాము తీర్చిదిద్దు కోవాలని వెంకయ్య ఆకాంక్షించారు. భవిష్యత్‌ భారత నిర్మాణంలో యువత పాత్ర ఎంతో కీలకమన్నారు. నైపుణ్యం కలిగిన యువతరమే నవ్యభారతాన్ని సమగ్రంగా నిర్మించగలరని అభిలషించారు. ఇందు కోసమే స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేస్తోందన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన విద్యావిధానంలో నైపుణ్యాభివృద్ధికి పెద్ద పీట వేశారని చెప్పారు. నైపుణ్యాభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను పెట్టడం అభినంద నీయమన్నారు. ఇలాంటి అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచిం చారు. కరోనా సంక్షో భంలో కొత్త కొత్త నైపు ణ్యాలు బయటకు వచ్చా యని ఉపరాష్ట్రపతి అన్నారు. కరోనా మహమ్మారి కారణంగా దేశంలోని అన్ని రంగాలు కుదేలైనా రైతన్నలు వ్యవసాయ ఉత్పత్తిని రెట్టింపు చేశారన్నారు.
రైతులకు ఉపయోగపడేలా ఇన్నో వేషన్స్‌ తీసుకురావాలని వెంకయ్య ఆకాంక్షిం చారు. కరోనా కారణంగా ఏడాదిన్నరగా స్వర్ణ భారతి ట్రస్ట్‌ను సందర్శించ లేకపోయానని.. తొలిసారి హైదరాబాద్‌లో కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ విద్యార్థులను కలుసుకోవడం సంతోషంగా ఉందని వెంకయ్య అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆసుపత్రి వ్యవస్థాపకులు జీఎన్‌ రావు, స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ అధ్యక్షులు చిగురుపాటి కృష్ణ ప్రసాద్‌, కార్యదర్శి సుబ్బారెడ్డి, మల్లారెడ్డి విద్యాసంస్థల కోశాధికారి భద్రారెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img