Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ప్రజలు ఆశీర్వదిస్తే..వైఎస్సార్‌ సంక్షేమ పాలన తెస్తాం

పాదయాత్రలో వైఎస్‌ షర్మిల
ఉద్యమ కారుడు కదా అని కేసీఆర్‌కు సీఎం పీఠం అప్పజెప్తే ఎనిమిదేళ్లుగా తను ఆడిరది ఆట.. పాడిరదే పాటగా పాలన సాగుతోందని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల మరోసారి విరుచుకుపడ్డారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఆమె ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మధిర నియోజక వర్గం మడుపల్లిలో ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడుతూ, ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం మొద్దునిద్ర పోతోందన్నారు. ప్రతిపక్షాల నాయకులు కేసీఆర్‌కు అమ్ముడుపోయారని ఆరోపించారు. ప్రజల పక్షాన నిలబడేందుకు పార్టీ పెట్టామని చెప్పుకొచ్చారు. తమ పార్టీని ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. ప్రజలు ఆశీర్వదిస్తే వైఎస్సార్‌ సంక్షేమ పాలన తీసుకొస్తామన్నారు. గెలిపిస్తే ప్రజారంజక పాలన అందిస్తామని వైఎస్‌ షర్మిల చెప్పారు. ‘ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తాం. ఆరోగ్యశ్రీ బ్రహ్మాండంగా అమలు చేస్తాం. పోడు భూములకు పట్టాలు ఇస్తాం. తెలంగాణ గడ్డ అభివృద్ధి కోసం నిలబడతాం. కేసీఆర్‌ చేతిలో ఈ సారి మళ్లీ రాష్ట్రాన్ని పెడితే సర్వనాశనం చేస్తారు’ అని షర్మిల అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img