స్వార్థ రాజకీయాలకు మునుగోడు ఉపఎన్నికతో చెక్ పెట్టాలని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కాంట్రాక్టుల కోసం రాజకీయాలు చేసే పార్టీలకు ఈ ఎన్నికలు రెఫరెండమని చెప్పారు. గత ఎన్నికల్లో గెలుపొందిన రాజగోపాల్ రెడ్డి ప్రజా సమస్యలను పరిష్కరించడం కాదు.. కనీసం వినడానికి కూడా గ్రామాలకు రాలేదని విమర్శించారు. మునుగోడు ఉపఎన్నికల్లో భాగంగా సంస్థాన్ నారాయణపురంలో మంత్రి గంగుల ఇంటింటి ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలిపించాలని కోరారు. టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే నిజయోజకవర్గ సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా అభివృద్ధి జరిగిందో మునుగోడును సైతం అదేలా అభివృద్ధి చేసుకోవాలంటే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ ఎన్నికలు స్వార్థ కాంట్రాక్టులు చేసే అభ్యర్థులకు, పార్టీలకు రెఫరండంగా ఉంటాయని, ప్రజలు నిజమైన సేవచేసేవారిని గెలిపిస్తారని మంత్రి గంగుల చెప్పారు.