Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ప్రజల జీవితాల్లో భోగి భోగ భాగ్యాలు నింపాలి : మంత్రి హరీష్‌ రావు

ఉమ్మడి మెదక్‌ జిల్లా ప్రజలకు మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా మంత్రి హరీష్‌ రావు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సకల సంపదలతో సంక్రాంతి పర్వదినాన్ని కుటుంబ సభ్యులంతా కలిసి ఆనందంగా జరుపుకోవాలని.. ఈ సంక్రాంతి ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన కాంతి తీసుకరావాలని ఆకాంక్షించారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో ప్రభుత్వం అభివృద్ధి , సంక్షేమ రంగంలో వృద్ధి చెందిందన్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలు ప్రజలకు సమృద్ధిగా అందుతున్నాయన్నారు.. జిల్లాలో గోదావరి జలాలతో పసిడి పంటలు పండి.. సాగు పరిడవిల్లిందన్నారు. రైతుల ఇంటా నిత్యం కొత్త కాంతులు చూడలన్నదే సీఎం కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ లక్ష్యం అని వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img