తెలంగాణలో పాజిటివిటీ రేటు 0.7 శాతం నుంచి 1 శాతానికి పెరిగింది
ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశాలు ఉండకపోవచ్చు
అయినా అందరూ అప్రమత్తంగా ఉండాలి
తెలంగాణలో కొన్ని రోజులుగా కొవిడ్ కేసులు పెరుగుతున్నాయని, ప్రతి ఒక్కరు బయటకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు సూచించారు. రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితిపై శుక్రవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. రోజువారీ పాజిటివిటీ రేటు 0.7 శాతం నుంచి 1 శాతానికి పెరిగిందని తెలిపారు. కరోనా పెరుగుదల ప్రభావం మరో 4 వారాల నుంచి 6 వారాల పాటు ఉండొచ్చని చెప్పారు. కేసుల పెరుగుదల ఆందోళన కలిగించే విషయమే అయినప్పటికీ… ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశాలు ఉండకపోవచ్చని అన్నారు. అయినప్పటికీ అందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అందరూ విధిగా మాస్కులు ధరించాలని సూచించారు. ఏమాత్రం కోవిడ్ లక్షణాలు కన్పించినా వెంటనే హెల్త్ సెంటర్ కి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు.