గవర్నర్ తమిళిసై
గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఇవాళ మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని కేసీ తండాలో పర్యటించారు. ఈ సందర్భంగా కేసీ తండాలో గవర్నర్ రెండో డోసు టీకా తీసుకున్నారు.ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు సమావేశంలో గవర్నర్ పూర్తిగా తెలుగులో ప్రసంగించారు. ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలి.. కరోనా నుంచి రక్షణ పొందాలని పిలుపునిచ్చారు. ‘గిరిజన గ్రామాల్లో వ్యాక్సినేషన్ తక్కువగా జరుగుతోందని తెలిసింది. మీకందరికి ధైర్యం చెప్పేందుకు కేసీ తండాకు వచ్చాను. అందరూ ధైర్యంగా వ్యాక్సిన్ తీసుకోవాలి.’ అన్నారు. అందరూ తప్పకుండా మాస్కు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలన్నారు. తరుచూ చేతులను శానిటైజర్తో శుభ్రంగా కడుక్కోవాలి. కొవిడ్ నుంచి రక్షణ పొందాలి అని సూచించారు.