Friday, April 19, 2024
Friday, April 19, 2024

ప్రతి పౌరుడు ఆరోగ్యంగా ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయం : మంత్రి హరీశ్‌రావు

సీఎం కేసీఆర్‌ వైద్య రంగానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తున్నారని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. పేదలకు మెరుగైన వైద్య సేవలను అందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం జిల్లాలోని కోహీర్‌ మండలం భిలాల్‌పూర్‌ గ్రామంలో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణలోని ప్రతి పౌరుడు ఆరోగ్యంగా ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. అలాగే ప్రతి సబ్‌ సెంటర్‌ నిర్మాణానికి రూ.20 లక్షలను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జహీరాబాద్‌ ఎమ్మెల్యే మాణిక్‌ రావు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img