Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ప్రభుత్వాల ప్రణాళికల కోసం వైరస్‌ వేచి చూడదు

: హైకోర్టు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ చేపట్టింది. థర్డ్‌వేవ్‌ ఎదుర్కొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని హైకోర్టుకు డీహెచ్‌ నివేదిక సమర్పించారు. నిపుణుల సలహా కమిటీ సమావేశం ఇంకా జరగలేదని, కరోనా మందులు అత్యవసర జాబితాలో చేర్చే ప్రక్రియ కూడా ఇంకా కొనసాగుతోందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు.. ప్రభుత్వాల ప్రణాళికలు, ప్రక్రియల కోసం వైరస్‌ వేచి చూడదని పేర్కొంది. థర్డ్‌వేవ్‌ ముప్పు ముంచుకొస్తోందన్న హెచ్చరికలున్నాయని గుర్తుచేసింది. ఇప్పటికే కరోనా బారినపడి అనేకమంది చనిపోయారు. గత అనుభవాల దృష్ట్యా నష్టాన్ని నివారించాలని పేర్కొంది. వారంలో నిపుణుల కమిటీ సమావేశం నిర్వహించాలని ఆదేశాలిచ్చింది. పిల్లల చికిత్సకు అవసరమైన పడకలు, ఇతర వసతుల వివరాలు సమర్పించాలని స్పష్టం చేసింది. ఆదేశాలు అమలు కాకపోతే డీహెచ్‌, కేంద్ర నోడల్‌ అధికారి కోర్టులో హాజరుకావాలంది. తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img