భువనగిరి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి ఆవరణలో గంజాయి మొక్కలు మొలిచాయి. ఇప్పుడు అది స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. గతంలో ఇక్కడ అంబులెన్స్ డ్రైవర్లు గంజాయి సేవించేవారని, ఆ కారణంగానే గంజాయి మొక్కలు మొలిచి ఉండవచ్చునని స్థానికులు చెబుతున్నారు. కాగా ఆసుపత్రి ఆవరణలో గంజాయి మొక్కలు ఎలా వచ్చాయో విచారణ జరుపుతామని, ఈ విషయంపై ఆసుపత్రి శానిటేషన్, సెక్యూరిటీ సిబ్బందికి మెమోలు జారీ చేసినట్లు సూపరింటెండెంట్ రవిప్రకాశ్ తెలిపారు.