ఫుడ్డింగ్ అండ్ మింక్ పబ్ కేసులో నిందితుల కస్టడీపై నాంపల్లి కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. నిందితులను ఏడురోజుల కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీకి తీసుకుంటేనే ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు రాబట్టే అవకాశముంటుందని పోలీసులు కోర్టుకు దృష్టికి తీసుకెళ్లారు. ఇక పబ్లో డ్రగ్స్ సేవించిన వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. పదిమందికి పైగా డ్రగ్స్ సేవించి ఉంటారని అనుమానిస్తున్నారు. పబ్ మేనేజర్ అనిల్తో పాటు అభిషేక్ కనుసన్నల్లోనే డ్రగ్స్ సరఫరా అయినట్లు పోలీసుల విచారణలో తేలింది. గోవా, ముంబై నుంచి అనిల్ డ్రగ్స్ తెప్పించినట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి.ఇక డ్రగ్ రాకెట్ తో సంబంధాలు కలిగిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు ఉచ్చు బిగుసుకుంటోంది.