ఫ్రాన్స్ రాజధాని పారిస్లో జరగనున్న పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మంత్రి కేటీఆర్ బృందం బుధవారం ఉదయం బయలుదేరింది. కేటీఆర్తో పాటు ప్రతినిధి బృందంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. ఫ్రెంచ్ సెనేట్లో జరిగే యాంబిషన్ ఇండియా 2021 కార్యక్రమంలో ఈనెల 29న మంత్రి కేటీఆర్ కీలకోపన్యాసం చేయనున్నారు. పలువురు ఫ్రెంచ్ పారిశ్రామికవేత్తలు, సీఈవోలతో కేటీఆర్ సమావేశం కానున్నారు.