Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

బండి, రేవంత్ లకు షర్మిల పిలుపు.. కేసీఆర్ పై పోరాటానికి ఆహ్వానం

తెలంగాణ ప్రభుత్వంపై ఉమ్మడి పోరాటానికి అన్ని ప్రతిపక్షాలు ఏకం కావాలని వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. ఈమేరకు ఆమె బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు, తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డికి స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ప్రగతి భవన్ ముట్టడించేందుకు ఉమ్మడి కార్యాచరణ సిద్ధం చేద్దామని వారిని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పరిపాలనను అంతం చేసేందుకు ప్రతిపక్షాల ఐక్యత ఎంతో అవసరమని, దీనిపై చర్చించేందుకు తనతో కలిసి రావాలని బండి, రేవంత్ లను కోరారు. కాగా.. షర్మిల ఆహ్వానంపై బండి సంజయ్ వెంటనే స్పందించారు. త్వరలోనే కలిసి ఉమ్మడి కార్యాచరణకు ప్రణాళిక సిద్ధం చేద్ధామని షర్మిలకు హామీ ఇచ్చారు. అయితే రేవంత్ రెడ్డి నుండి మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img