Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

బండి సంజయ్‌కు నోటీసులు.. రాణి రుద్రమ, దరువు ఎల్లన్న అరెస్టు

సీఎం కేసీఆర్‌, ప్రభుత్వ పథకాలను కించపరిచేలా స్కిట్‌ ప్రదర్శించిన విషయంలో బీజేపీ నేతలు రాణి రుద్రమ, దరువు ఎల్లన్నలను పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల మరో నేత జిట్టా బాలకృష్ణారెడ్డి అరెస్టు చేసిన పోలీసులు అనంతరం బెయిల్‌పై విడుదల చేశారు. బీజేపీ నేతలు రాణి రుద్రమ్మ, దరువు ఎల్లన్నను పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు ప్రభుత్వ పథకాలను కించపరిచేలా ప్రదర్శించిన స్కిట్‌ విషయంలో ఈ ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని బండ్లగూడలో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన ‘అమరుల యాదిలో.. ఉద్యమ ఆకాంక్షల సాధన సభ’ జరిగింది. ఇందులో ఆ స్కిట్‌ను ప్రదర్శించారు. దీనిపై టీఆర్‌ఎస్‌ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే కేసులో నాలుగు రోజుల కింద బీజేపీ నేత జిట్టా బాలకృష్ణారెడ్డిని అరెస్ట్‌ చేసిన పోలీసులు.. అదే రోజు బెయిల్‌పై ఆయనను విడుదల చేశారు. తాజాగా రాణి రుద్రమ, దరువు ఎల్లన్నను అరెస్ట్‌ చేశారు. ఈ క్రమంలోనే బీజేపీ స్టేట్‌ చీఫ్‌ బండి సంజయ్‌కు 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img