జైలుకు తరలింపు
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో అతన్ని కోర్టు నుంచి కరీంనగర్ జైలుకు పోలీసులు తరలించారు. బండి సంజయ్ బెయిల్ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. ఈ నెల 17వ తేదీ వరకు బండి సంజయ్తోపాటు కార్పొరేటర్ పెద్దపల్లి జితేందర్, పుష్పాల రఘు, కాచు రవి, మర్రి సతీశ్కు కోర్టు జ్యుడీషియల్ రిమాండు విధించింది. మరో పదకొండు మంది పరారీలో ఉన్నట్లు పోలీసులు రిమాండు రిపోర్టులో పేర్కొన్నారు. జాగరణ పేరుతో ఆదివారం రాత్రి కరీంనగర్లో దీక్ష చేపట్టారు. అయితే కొవిడ్ నిబంధనలు అతిక్రమించి దీక్ష చేపట్టరాదని పోలీసులు నోటీసు జారీ చేసినా వినలేదు. ు. ఈ క్రమంలో కొద్దిసేపు హైడ్రామా నడిచింది. బండి సంజయ్ దీక్షను భగ్నం చేసేందుకు వచ్చిన పోలీసులను కార్యకర్తలు అడ్డుకున్నారు.అయితే పోలీస్ ఫోర్సుతో వచ్చి.. బండి సంజయ్ దీక్షను భగ్నం చేశారు.