Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

బండి సంజయ్‌ చేస్తున్నది ముమ్మాటికీ ప్రజా వంచన యాత్ర : మంత్రి కేటీఆర్‌

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేస్తున్నది ముమ్మాటికీ ప్రజా వంచన యాత్ర అని మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. బండి సంజయ్‌ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్రపై మంత్రి కేటీఆర్‌ బహిరంగ లేఖ రాశారు పచ్చబడుతున్న పాలమూరుపై కక్ష కట్టిన మీకు అక్కడ అడుగుపెట్టే హక్కులేదని దుయ్యబట్టారు.బండి సంజయ్‌ తన పాదయాత్రను పాలమూరు జిల్లా నుంచి ప్రారంభించడమంత దగాకోరుతనం ఇంకొకటి లేదని పేర్కొన్నారు. ‘పచ్చ బడుతున్న పాలమూరుపై పగ బట్టిన పార్టీకి అధ్యక్షుడైన బండి సంజయ్‌కు అక్కడ అడుగుబెట్టే నైతిక అర్హత లేదు. పాలమూరు గడ్డకు బీజేపీ చేసిన ద్రోహం, ప్రాజెక్టుల మంజూరులో చూపిన నిర్లక్ష్యం, నిధుల విడుదలలో కేంద్ర ప్రభుత్వం చేసిన వంచనకు పాలమూరు ప్రజానికానికి బండి సంజయ్‌ క్షమాపణ చెప్పాలి. దశాబ్దాల పోరాటంతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని పదేపదే ప్రశ్నిస్తు, ఎగతాళి చేస్తున్న నియంతృత్వ పోకడలపై ముందుగా తెలంగాణ జాతికి క్షమాపణ చెప్పి పాదయాత్రను ప్రారంభిస్తే కాస్తయినా గౌరవం దక్కుతుంది.’ అని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img