Friday, April 19, 2024
Friday, April 19, 2024

బడుగు బలహీనవర్గాల అభివృద్ధినే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి తలసాని

కుల వృత్తులపై ఆధారపడిన జీవనం సాగిస్తున్నవారు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. కాకతీయ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ చైర్మన్‌గా నియమితులైన సుందర్‌ రాజ్‌ యాదవ్‌ శనివారం ఉదయం మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, బడుగు బలహీనవర్గాలకు రాజకీయంగా సముచిత గౌరవం కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని అన్నారు. బలహీన వర్గాలకు రాజకీయంగా అధిక ప్రాధాన్యం కల్పించేలా చట్టసభల్లో, నామినేటెడ్‌ పోస్టులు, పార్టీ పదవుల భర్తీలో గతంలో ఎప్పుడూ లేనివిధంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అవకాశం కల్పిస్తున్నదని చెప్పారు. ప్రభుత్వం పథకాలను ప్రతిఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img