: మహిళా కమిషన్ చైర్మన్
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సైదాబాద్ చిన్నారి హత్యాచారం కేసు నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. నిందితుడు రాజు ఆత్మహత్యతో చిన్నారి ఆత్మకు శాంతి చేకూరిందని మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. హత్యాచార ఘటనలు అత్యంత బాధాకరమని వెల్లడిరచారు. బాలికల్లో అవగాహన కోసం కార్యక్రమాలు చేపడతామని చెప్పారు.