హైదరాబాద్ : బాసర ట్రిపుల్ ఐటీకి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం సాయంత్రం బయల్దేరారు. విద్యార్థులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి చర్చించనున్నారు. మంత్రి సబిత వెంట విద్యాశాఖ కార్యదర్శి, ఉన్నత విద్యామండలి చైర్మన్ ఉన్నారు. ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని గత ఏడు రోజులుగా విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.