ఆలేరు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు. ప్రతి ఒక్కరు డబుల్ ఇంజిన్ సర్కార్ పేరుతో మాటలు చెప్పడమే తప్ప తెలంగాణ అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. బీజేపీలో చేరినప్పటి నుంచి అవమానాలు ఎదుర్కొన్నానని పేర్కొన్నారు. బీజేపీ బీసీల మనోభావాలకు విలువ లేకుండా చేసిందన్నారు. బీజేపీ తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తుందని ధ్వజమెత్తారు.