Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

బీజేపీది అసత్య ప్రచారం : మంత్రి గంగుల కమలాకర్‌

నమ్మి గెలిపించిన కరీంనగర్‌ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయమని, మాపై బీజేపీ నాయకులు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. గురువారం కరీంనగర్‌ 43వ డివిజన్‌ లో రూ.20 లక్షల నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్‌ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టి ఆరోపణల్లో నిజానిజాలు తేల్చాలన్నారు. నిరాధారమైన ఆరోపణలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. నన్ను విచారణ కోసం హైదరాబాద్‌ రావాలని పిలిచారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు%ౌౌ% వాళ్ళు విచారణ కోసం పిలిస్తే వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. దర్యాప్తు సంస్థల అధికారులకు అందుబాటులో ఉండి, వారికి కావలసిన సమాచారం ఇవ్వాలని విదేశాల పర్యటనలో ఉన్న నేను తిరిగి రావడం జరిగిందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img