Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

బీజేపీని పాతరేయండి : మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

కేంద్రం ఇష్టానుసారంగా నిత్యావసరాల ధరలు పెంచి పేదోడిపై గుదిబండ మోపుతోందని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలను ఇష్టానుసారంగా పెంచుతున్న బీజేపీ ప్రభుత్వానికి మునుగోడు ఓటర్లు బుద్ధి చెప్పాలన్నారు. చౌటుప్పల్‌ మున్సిపాలిటీ పరిధి తాళ్లసింగారం గ్రామంలో ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్నారు. అణగారిన వర్గాలకు సైతం అన్ని రకాలుగా అండగా ఉంటూ భరోసా కల్పిస్తున్న నాయకుడు సీఎం కేసీఆర్‌ మాత్రమేనన్నారు. బీ(టీ)ఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img