Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

బీజేపీ కుట్రను నిరసిస్తూ ధర్నా.. ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం

తెరాస ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ పన్నిన కుట్రలను నిరసిస్తూ తెరాస పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. గురువారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కమాన్‌ చౌరస్తా వద్ద రాజీవ్‌ రహదారిపై ధర్నా చేపట్టిన అనంతరం ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ డాక్టర్‌ దాసరి మమతరెడ్డి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య బద్ధంగా తెరాస పార్టీ నుంచి ఎన్ని-కై-న నలుగురు ఎమ్మెల్యేలను ప్రజాస్వామ్య విరుద్దంగా కోట్లాది రూపాయలతో కొనుగోలు చేసేందుకు సిద్ధపడడం హేయమైన చర్యగా అభివర్ణించారు. ప్రజల అభిమానం పొందలేకనే ఇలాంటి నీచ రాజకీయాలకు తెర తీస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ కుట్రలను తెరాస ఎమ్మెల్యేలు తిప్పి కొట్టడం గర్వంగా ఉందన్నారు. ఇప్పటి-కై-నా బీజేపీ పార్టీ పద్ధతి మార్చుకోవాలని, రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెరాస పట్టణ అధ్యక్షుడు ఉప్పు రాజ్‌కుమార్‌, తెరాస కౌన్సిలర్లు, కో-ఆప్షన్‌ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img