Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

బీజేపీ నేతలకు మునుగోడు ప్రజలు బుద్ధిచెప్తారు : మంత్రి హరీశ్‌ రావు

మద్యం, డబ్బుతో గెలుస్తామంటున్న బీజేపీ నేతలకు మునుగోడు ప్రజలు బుద్ధిచెప్తారని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. రాజగోపాల్‌ రెడ్డి స్వార్థం కోసమే ఉపఎన్నిక వచ్చిందని చెప్పారు. కోమటిరెడ్డి మళ్లీ గెలిస్తే ఏ లాభమని, టీఆర్‌ఎస్‌ను తిట్టడం తప్ప చేసేదేంలేదన్నారు. ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఉదయం మర్రిగూడెం మండలం రాజుపేట గ్రామస్తులతో మంత్రి హరీశ్‌ సమావేశమయ్యారు. అనంతరం మాట్లాడుతూ.. తండాలను గ్రామ పంచాయతీలుగా చేయాలన్న గిరిజన సోదరుల డిమాండ్‌ను నాడు అధికారంలో ఉన్న టీడీపీ, కాంగ్రెస్‌లు పట్టించుకోలేదని చెప్పారు. కానీ స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ తండాలను గ్రామ పంచాయతీలుగా చేశారన్నారు. దీంతో మొత్తం 3146 మంది సర్పంచులు అయ్యారని గుర్తుచేశారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన రాజగోపాల్‌ రెడ్డి ఈ నాలుగేండ్లలో ఒక్కసారైనా గ్రామానికి వచ్చాడా అన్నారు. కనపడని మనిషి రాజగోపాల్‌ రెడ్డిని గెలిపించుకంటారా లేక అభివృద్ధి చేసే టీఆర్‌ఎస్‌ని గెలిపిస్తారా.. ఆగం కాకుండా ఓటెయ్యాలని కోరారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి గెలిపించాలన్నారు. గ్రామాభివృద్ధికి తనది బాధ్యత అని స్పష్టం చేశారు.ఎంబీబీఎస్‌ కోర్సుల్లో గిరిజనులకు పది శాతం కల్పించామని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. దీంతో 6615 మెడికల్‌ సీట్లలో 661 సీట్లు ఎస్టీలకు కేటాయిస్తున్నామని చెప్పారు. ఇది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధి అని వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img