దేశ ప్రజలకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పి కొత్త వ్యవసాయ చట్టాలు ఉపసంహరించుకున్నారని, ఏడాది కాలంగా వీటిని సమర్థిస్తూ మాట్లాడిన బీజేపీ రాష్ట్ర నేతలు కూడా తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రైతు ప్రయోజనాలు కాపాడే నేతలను పిలిపించుకుని మాట్లాడి రైతుమేలు చేసే నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు. జిల్లా మరిపెడ మండలం తాళ్ల ఊకళ్లు గ్రామంలో సోమవారం ఉమామహేశ్వర దేవస్థానంలో లింగ పునఃప్రతిష్ట, ధ్వజస్థంభం ప్రతిష్ట కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొని మాట్లాడారు.నేడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోచంపల్లి శ్రీనివాసరెడ్డి నామినేషన్ వేస్తున్నారు. ఎన్నిక ఏదైనా గెలుపు టీఆర్ఎఎస్ పార్టీదే అన్నారు.