Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

బీసీలపై వివక్ష తగదు..

రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్‌.బాలమల్లేష్‌
విశాలాంధ్ర`హైదరాబాద్‌ : రాష్ట్రంలో బీసీ సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా అమలు చేయడంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎన్‌.బాలమల్లేష్‌ విమర్శించారు. ఆదివారం బీసీ సంఘం ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వద్ద జరిగిన దీక్ష కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. బీసీల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశ పెడుతున్నామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించినా వాటిని అమలు చేయడం లేదని విమర్శిం చారు. హైదరాబాద్‌ నగరంలో డా.బి.ఆర్‌.అంబేదర్కర్‌, పూలే విగ్రహాలను ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. ఆత్మగౌరవ భనాలను బీసీలకు నిర్మించడంలో వివక్ష చూపుతున్నారని, హైదరాబాద్‌ నడిబొడ్డులో ఆత్మగౌరవ భవనాలను అందరికీ అందుబాటులో ఉండేలా నిర్మించాలని డిమాండ్‌ చేశారు. బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీమాన్‌గౌడ్‌ ప్రసం గిస్తూ బీసీల ఆత్మగౌరవ భవనాలు నగరానికి దూరంగా ఇతరుల ఆత్మగౌరవ భవనాలు హైదరాబాద్‌లో నిర్మించడం వివక్షకు అద్దం పడుతుందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img