Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

భక్తులకు టీఎస్‌ఆర్టీసీ ఆఫర్‌..రాష్ట్రంలోని శైవక్షేత్రాలకు 2427 ప్రత్యేక బస్సులు

ప్రయాణికుల సౌకర్యార్థం తెలంగాణ ఆర్టీసీ అనేక రకాల చర్యలు చేపడుతోంది. రకరకాల ఆఫర్లను ప్రకటిస్తూ ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు డీపోల్లో కొత్తగా సూపర్‌ లగ్జరీల బస్సులను ప్రవేశపెట్టింది. అంతేకాకుండా పలు పండుగలను పురస్కరించుకొని ప్రత్యేక బస్సులను సైతం నడిపించింది. ఈ క్రమంలోనే తాజాగా మహా శివరాత్రి నేపథ్యంలో భారీగా ప్రత్యేక బస్సులను నడిపిస్తోంది.ఫిబ్రవరి 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఏకంగా 2427 ప్రత్యే బస్సులను నడిపించేందుకు తెలంగాణ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 40 శైవక్షేత్రాలకు సర్వీసులు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా టీఎస్‌ఆర్టీసీ ఈ ఏర్పాట్లు చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img