Friday, April 19, 2024
Friday, April 19, 2024

భవిష్యత్తు లేని, ప్రజల అభిమానం లేని ప్రతిపక్ష పార్టీలతో అయ్యేది ఏమిలేదు : మంత్రి ఎర్రబెల్లి

జనగామ జిల్లా, పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల, కడవెండిలకు చెందిన పలువురు కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో సోమవారం ఆ పార్టీకి రాజీనామా చేసి, టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన యువకులకు గులాబీ కండువాలు కప్పి, వాళ్ళను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు మాట్లాడుతూ, దేశంలోనే టీఆర్‌ఎస్‌ పార్టీ అత్యంత ప్రజాదరణ, పార్టీ సభ్యత్వం కలిగిన పార్టీ అన్నారు. ఈ పార్టీలో చేరడం పట్ల మనమంతా గర్వ పడాలని చెప్పారు. కేసీఆర్‌ అనుభవంతో కూడిన దిశా నిర్దేశం, యంగ్‌ అండ్‌ డైనమిక్‌ కేటీఆర్‌ లీడర్‌షిప్‌ ఉన్న పార్టీ అని చెప్పారు. భవిష్యత్తు లేని, ప్రజల అభిమానం లేని ప్రతిపక్ష పార్టీలతో అయ్యేది ఏమి లేదన్నారు. దిక్కు తోచని స్థితిలో ఉన్న ఆ పార్టీలకు రాజీనామా చేసి, తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావడానికి యువత ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్లకు మంచి భవిష్యత్తు ఉంటుందని, తగిన గుర్తింపు దక్కుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img