అధికారంలో ఉన్నవారి శక్తి కన్నా.. ప్రజాశక్తియే ఎప్పటికీ గొప్పదని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించిన నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ఇవాళ రియాక్ట్ అయ్యారు. భారతీయ రైతులు మరోసారి తమ సత్తాను చాటారని, అవిశ్రాంత పోరాటం వల్ల తమ డిమాండ్లను సాధించుకున్నట్లు పేర్కొన్నారు. ఆ కామెంట్కు ఆయన విజయసూచిక ఉన్న ఎమోజీని కూడా పోస్టు చేశారు. జైకిసాన్, జై జవాన్ అంటూ తన ట్వీట్లో మంత్రి కామెంట్ చేశారు.