Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

మంచి పేరు, డిజైన్‌ చెప్పండి. రివార్డ్స్‌ గెలుచుకోండి.. సజ్జనార్‌ బంపరాఫర్‌

తెలంగాణ ఆర్టీసీ మరో వినూత్న నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే కొత్త బిజినెస్ట్‌ స్టార్ట్‌ చేయబోతోంది. ప్రయాణికుల కోసం 500 ఎంఎల్‌, 1 లీటర్‌ వాటర్‌ బాటిళ్ల ఉత్పత్తిని త్వరలోనే ప్రారంభించబోతున్నట్లు సంస్థ ఎండీ సజ్జనార్‌ తెలిపారు. దీనికి సంబంధించి మంచి టైటిల్‌తో పాటు డిజైన్‌ పంపిన వారికి బహుమతులు అందజేయనున్నట్లు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ఎండీగా బాధ్యతలు చేపట్టినప్పట్నుంచి సజ్జనార్‌ సంస్థ రూపు రేఖలు మార్చే పనిలో పడ్డారు. మూస పద్ధతిలో కాకుండా.. వినూత్న ఆలోచనలతో సంస్థను ముందుకు తీసుకుపోతున్నారు. నష్టాల బాటలో పయనిస్తున్న సంస్థను గాడిన పెట్టేందుకు ఇప్పటికే ఎన్నో చర్యలు తీసుకుని అమలు చేశారు. ఈ క్రమంలోనే తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు. ప్రయాణికుల కోసం వాటర్‌ బాటిళ్లను తయారుచేసి విక్రయించేందుకు సిద్ధమైంది ఆర్టీసీ.. ఈ విషయాన్ని సజ్జనార్‌ ట్వీట్‌ ద్వారా పంచుకున్నారు. వాటర్‌ బాటిళ్లకు మంచి టైటిల్‌తో పాటు డిజైన్‌ సూచించండంటూ ప్రయాణికులను కోరారు. ఎవరైతే బెస్ట్‌ డిజైన్‌తో పాటు టైటిల్‌ పంపుతారో వారికి బహుమతి కూడా ఇవ్వనున్నట్లు వివరించారు. ‘ప్రయాణికుల కోసం 500 ఎంఎల్‌, 1 లీటర్‌ వాటర్‌ బాటిళ్ల ఉత్పత్తిని త్వరలోనే ప్రారంభించబోతున్నాం.. వాటర్‌ బాటిల్‌కు మంచి టైటిల్‌తో పాటు డిజైన్‌ను సూచించగలరు. ఉత్తమ టైటిల్‌తో డిజైన్‌ను సూచించిన వారికి బహుమతి కూడా ఇవ్వబోతున్నాం. మీ సూచనలను మా వాట్సాప్‌ నంబర్‌ 94409 70000కు పంపండి’ అంటూ ట్వీట్‌ చేశారు.అలాగే.. ‘టీఎస్‌ఆర్‌టీసీ చేసే చారిత్రాత్మక మార్పునకు మీ తోడ్పాటు ఇవ్వండి. చరిత్రలో నిలిచిపోండి. వాటర్‌ బాటిల్‌కు మంచి పేరు, డిజైన్‌ చెప్పండి. రివార్డ్స్‌ గెలుచుకోండి’ అంటూ తెలుగు, ఇంగ్లిష్‌ భాషల్లో రూపొందించిన పోస్టర్లను ట్వీట్‌కు జత చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img