Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

మంచి రోజులు వచ్చేశాయ్‌.. అందరికి శుభాకాంక్షలు

మంత్రి కేటీఆర్‌ సెటైర్లు

వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర మరోసారి పెరిగిన సంగతి తెలిసిందే.14 కేజీల సిలిండర్‌ ధరను కేంద్ర ప్రభుత్వం రూ. 50 పెంచింది. తాజా పెంపుతో హైదరాబాద్‌లో రూ. 1,055గా ఉన్న సిలిండర్‌ ధర రూ. 1,105కి చేరుకుంది. దిల్లీలో సిలిండర్‌ ధర రూ. 1,053కి చేరుకుంది. పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీపై మంత్రి కేటీఆర్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘మంచి రోజులు వచ్చేశాయ్‌.. అందరికి శుభాకాంక్షలు. వంటింటి గ్యాస్‌ లిండర్‌ ధరను కేంద్రం మరో రూ.50 పెంచేసింది. సిలిండర్‌ ధర పెంచి మహిళలకు ప్రధాని మోదీ కానుకగా ఇచ్చేశారు’ అని ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. మరోవైపు, గ్యాస్‌ ధరను మరోసారి పెంచడంతో సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img