Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

మంత్రి ఎర్రబెల్లికి కృతజ్ఞతలు తెలిపిన సీఈఓలు, డిప్యూటీ సీఈఓలు

తమకు పదోన్నతులు కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపేందుకు పలు జిల్లా పరిషత్‌ల సీఈఓలు, డిప్యూటీ సీఈఓలు రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావును హైదరాబాద్‌ లోని మంత్రుల నివాసంలో సోమవారం కలిశారు. వారు కృతజ్ఞతలు తెలుపగా, ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చేసే విధంగా, ప్రజలకు ప్రభుత్వ పథకాలన్నీ సకాలంలో అందేవిధంగా పని చేయాలని మంత్రి ఈ సందర్భంగా వారిని కోరారు. సీఈఓలు, డిప్యూటీ సీఈఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాఘవేందర్‌ రావు, ఎంపీడీఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం సత్తయ్య, పలువురు సీఈఓలు, డిప్యూటీ సీఈఓలు మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img